తాడిపత్రి పట్టణంలోని ఓంశాంతి నగర్ చెందిన హాజీ, వేణు, రాజు, శారద, సత్తెమ్మ, బాల గౌరీ, రమాదేవితో పాటుగా 23కుటుంబాలు టీడీపీ వీడి కేతిరెడ్డి రమాదేవి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ పార్టీలోకి శనివారం చేరారు.రమాదేవి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.వారు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై వైఎస్సార్సీపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.