ఆయన మృతి తీరని లోటు

85చూసినవారు
ఆయన మృతి తీరని లోటు
ఈనాడు సంస్థల యజమాని, కృషీవలుడు రామోజీరావు మృతి సినీరంగానికి, పాత్రికేయ రంగానికి తీరని లోటని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామోజీరావు మృతికి జేసీ నివాళి అర్పించి మాట్లాడారు. చిన్నస్థాయి నుంచి అంచలు అంచలుగా ఎదిగి అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయుడన్నారు. తెలువారికి అర్ధమయ్యే విధంగా పాత్రికేయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్పవ్యక్తి అని జేసీ కొనియాడారు.

సంబంధిత పోస్ట్