తాడిపత్రిలో సీఎం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేద్దామని తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 28వ తేదీన ఉదయం 10 గంటలకు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం బహిరంగ సభ ఉంటుందన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.