కక్షతో అరటి మొక్కల తొలగింపు

84చూసినవారు
కక్షతో అరటి మొక్కల తొలగింపు
యాడికి మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు అరటి మొక్కలను పీకేశారు. మండల పరిధిలోని పెద్దపేట గ్రామానికి చెందిన లక్ష్మీదేవి తన వ్యవసాయ పొలంలో అరటి పంటను సాగు చేశారు. అయితే బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి ప్రవేశించి దాదాపు 70 అరటి మొక్కలను పీకేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్