22 నుంచి వేద గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవం

56చూసినవారు
22 నుంచి వేద గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవం
తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ మొదటి రోడ్డులో వెలసిన వేద గాయత్రీదేవి ఆలయ 9వ వార్షికోత్సవం ఈనెల 22 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు గణపతి పూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 24వ తేదీ ముగుస్తాయన్నారు. చివరి రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవాన్ని ఉంటుందని, ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్