ఉరవకొండలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో విడపనకల్ మండలం కరకముక్కల గ్రామానికి చెందిన సునీత (39) తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను స్థానికులు ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మహిళ కుడిచేతికి తీవ్రంగా ఫ్రాక్చర్ అవ్వడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.