ఉరవకొండలోనే తక్కువ మంది పోటీ
ఉరవకొండలో వివిధ పార్టీల నుండి 16 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా అందులో 5 తిరస్కరించినట్లు ఆర్వో కేతన్ గార్గ్ తెలిపారు. ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో 11 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించామన్నారు. కూటమి నుంచి పయ్యావుల, వైసీపీ-విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కూటమి-మధుసూదన్ ప్రధానంగా బరిలో ఉన్నారు. కాగా జిల్లాలో ఇక్కడే తక్కువగా 11 మంది పోటీ చేస్తున్నారు.