రాష్ట్రంలో పేదలు బాగుండాలంటే బాబు రావాలి: పయ్యావుల
ఉరవకొండ మండలం రాకెట్లలో శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సొంత గ్రామానికి కూడా రోడ్లు వేసుకోలేని దుస్థితిలో ఉన్నారని, హంద్రీనీవా కాలువ ఉరవకొండ నియోజకవర్గంలో నుండి వెళ్లిందంటే అది కేవలం తన పోరాటం వల్లే అని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.