రైతులకు ఉచితంగా ప్రొద్దు తిరుగుడు విత్తనాల పంపిణీ

78చూసినవారు
రైతులకు ఉచితంగా ప్రొద్దు తిరుగుడు విత్తనాల పంపిణీ
కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం రైతు సేవా కేంద్రంలో.. శనివారం వ్యవసాయ అధికారులు రైతులకు ఉచితంగా యన్డియస్ హెచ్ 1012 రకం మినికిట్స్ చిరు సంచుల పథకం క్రింద రైతులకు ప్రొద్దు తిరుగుడు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రైతుకు ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున 50 ప్యాకెట్లను, 50 మంది రైతులకు ఉచితంగా ప్రొద్దుతిరుగుడు విత్తనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్