ఇళ్ల స్థలాల పేరుతో ఘరానా మోసం

69చూసినవారు
ఇళ్ల స్థలాల పేరిట మదనపల్లెలో భారీ మోసం జరిగింది. మదనపల్లె పోలీసులకు సోమవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కదిరి మండలం ఇనగలూరుకు చెందిన మంజునాథ్, అతని ప్రియురాలు దివ్య మదనపల్లెకు వచ్చారు. కోళ్లబైలు గ్రామం బయ్యారెడ్డి కాలనీలో చేనేతల నుంచి ఒక్కో ఫ్లాటుకు దాదాపు రూ. 3నుంచి 4 లక్షలు మొత్తంగా రూ. 2కోట్ల వరకు వసూళ్లు చేశారు. మంజునాథ్ పరారీలో ఉండగా.. దివ్య తనకు సంబంధం లేదని బాధితులకు తేల్చిచెప్పింది.

సంబంధిత పోస్ట్