మదనపల్లెలో సచివాలయంలో వస్తువులు కాల్చివేత

71చూసినవారు
మదనపల్లె మండలం కొత్తఇండ్లు సచివాలయం, పంచాయతీకి చెందిన వస్తువులకు మంగళవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. సచివాలయం పరిధిలో ఉన్న చెత్తబుట్టిలు, ముఖ్యమైన వస్తువులను నిప్పు పెట్టి కాల్చివేశారన్నారు. ఉదయం సచివాలయ ఆఫీసుకు రాగానే డోర్లు తెరిచి ఉన్నాయని అన్నారు. లోపలికి వెళ్లి చూస్తే కొన్ని వస్తువులు కాలిపోయి ఉండగా పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్