విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎస్సై

81చూసినవారు
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎస్సై
రామసముద్రం మోడల్స్ స్కూల్లో మంగళవారం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై ఎస్సై వెంకటసుబ్బయ్య అవగాహన కల్పించారు. విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండి బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాలని, హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్