ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం: ఎమ్మెల్యే

63చూసినవారు
ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం: ఎమ్మెల్యే
ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారంలో 348 ఇళ్ళు సర్వే పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తున్నామని.. యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మంగళవారం పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్థానిక అధికారులు తమను పట్టించుకోలేదని, ఎన్ని మార్లు తమ సమస్యలను తెలిపినా అర్జీలను ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహారించారన్నారు. మీరైనా న్యాయం చేయాలనీ రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానందరెడ్డిని, శాసనసభ్యులు అరవ శ్రీధర్ ని ప్రజలు కోరగా.. వారు అధికారులను ఆదేశించి మంగళవారం సెర్వే పనులను మొదలు పెట్టారు.

సంబంధిత పోస్ట్