మల్లయ్యకొండ గోశాలకు పశు గ్రాసం వితరణ

73చూసినవారు
మల్లయ్యకొండ గోశాలకు పశు గ్రాసం వితరణ
అంగళ్లు సమీపంలోని మల్లయ్య కొండ ఆలయ గోశాలకు గురువారం జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు పశు గ్రాసం వితరణగా అందజేశారు. దేవస్థానం గోశాలలోని పశువులు మేత లేక విలవిల్లాడుతున్నాయని వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో పూజారివారిపల్లె గ్రామస్థులతో పాటు వాల్మీకిపురం, నరసాపురం, వెస్ట్ గోదావరి, అమెరికాకు చెందిన పలువురు దాతలు పశు గ్రాసం, ఆర్థిక సాయం అందజేసి ఉదారతను చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్