రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఇవాళ థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఎయిర్పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం థాయ్లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రతో భేటీ అయ్యారు. ఏప్రిల్ 4న బ్యాంకాక్లో జరగనున్న ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ కూటమి సమావేశంలో పాల్గొంటారు.