సీఎం వైఎస్
జగన్ రేపు(శుక్రవారం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రసంగిస్తారు. ఈ సభ నుంచే "జగనన్న విద్యా దీవెన పథకం" కింద నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.