ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఏపీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో
కాంగ్రెస్ మళ్లీ పుంజుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలాఖరులోపు విశాఖపట్నం వేదికగా బహిరంగ సభ నిర్వహించాలని
కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సభలో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఈ సభకు CM రేవంత్, CM సిద్ధరామయ్య వచ్చే అవకాశం ఉంది.