భర్తపై భార్య, ఆమె బంధువుల దాడి

61చూసినవారు
భర్తపై భార్య, ఆమె బంధువుల దాడి
భర్తను కొట్టిన ఘటనలో భార్యపై కేసు నమోదు చేసినట్లు బుధవారం పట్టాభిపురం పోలీసులు తెలిపారు. గుంటూరుకు చెందిన అంబేడ్కర్, రోజా మేరి దంపతులు వివాదాలతో భార్యా భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. వారి కుమారుడు అభినవ్ తన తండ్రి వద్ద ఉంటున్నాడు. బుధవారం బాలుడి స్కూల్ వద్ద అంబేడ్కర్ పై రోజా మేరీ, ఆమె బంధువులు దాడి చేసి బాలుడిని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్