అనితా.. అధికారం శాశ్వతం కాదు: మేరుగు నాగార్జున

62చూసినవారు
అనితా.. అధికారం శాశ్వతం కాదు: మేరుగు నాగార్జున
పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై మంగళవారం జరిగిన దాడిపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. “శంకర్రావుపై దాడిచేయడం హేయమైన చర్య పల్నాడులో జరుగుతున్న దాడులపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. హోంమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పల్నాడులో వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపైన మాత్రం ఆమె మాట్లాడటం లేదు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి”అని అన్నారు.

సంబంధిత పోస్ట్