నేటి నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

82చూసినవారు
నేటి నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన
మంగళవారం నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. అలాగే కుప్పంలోని రెండు గ్రామాలు పైపాళ్యం, కంచి బంధార్లపల్లిని ఆమె దత్తత తీసుకోనున్నారు. నియోజకవర్గ మహిళలతో భేటీ అయి వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్