టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని భయపెడుతున్నారని
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం గుంటూరులోని
వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మాట్లాడుతూ.. ‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగం పట్ల పట్టు సాధించే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చని, అందుకే కౌంటింగ్ సమయంలో
వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు.