జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీపై కలెక్టర్ కు వినతి

81చూసినవారు
జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీపై కలెక్టర్ కు వినతి
చిత్తూరు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ, ఏపీయూజేడబ్ల్యూ ప్రతినిధులు కలెక్టర్ సుమిత్ కుమార్ ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల పిల్లల కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీని అందించాలని కలెక్టర్ ను కోరగా, ఆయన తగు చర్యలు చేపడుతామని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ పుల్లయ్య, డిపిఆర్ఓ పద్మజను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్