పారిశుధ్య చర్యలు మెరుగుపరచాలి

83చూసినవారు
పారిశుధ్య చర్యలు మెరుగుపరచాలి
వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపలంలో పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరచాలని స్థానికులు గురువారం కోరారు. గ్రామం మేజర్ పంచాయతీ కావడమే కాకుండా వ్యాపార కేంద్రం కావడం వల్ల అనునిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు అధ్వానంగా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్