పాఠశాల పక్కా భవనాలకు నిధులు మంజూరు

63చూసినవారు
పాఠశాల పక్కా భవనాలకు నిధులు మంజూరు
బైరెడ్డిపల్లి మండలంలోని మూల తిమ్మేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పక్కా భవన నిర్మాణాలకు రూ. 1. 05 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు సోమవారం తెలిపారు. పాఠశాలలో దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి మూడే తరగతి గదులు ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో స్థానికులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు జిల్లా అధికారులు నిధులు మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్