నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

82చూసినవారు
పూతలపట్టు మండల కేంద్రంలోని పక్కాలగుట్టలో నీటి సమస్యను ఎమ్మెల్యే మురళీమోహన్ శుక్రవారం పరిష్కరించారు. గత కొన్నేళ్ళుగా 15 రోజులకోసారి తాగు నీరు ఇస్తున్నారని గ్రామస్తుల తెలిపారు. దీని పై స్పందించిన ఆయన అధికారులను వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకున్నారు. బోర్లు వెంటనే మరమ్మత్తు చేయాలని, అప్పటి వరకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్