రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

3593చూసినవారు
బంగారుపాళ్యం మండలంలోని మంగసముద్రానికి చెందిన రాజేంద్ర కాట్టప్పగారిపల్లి వద్ద శుక్రవారం రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి కారు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు. ఈ ఘటన పైన బంగారుపాళ్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్