లడ్డూ పవిత్రతపై సీఎం చంద్రబాబు దుస్ప్రచారం బాధాకరం

65చూసినవారు
చిత్తూరు పట్టణంలోని కట్టమంచి వరదరాజుల స్వామి ఆలయంలో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు శనివారం పూజలు చేశారు. ఈ పూజల్లో నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ విజయానంద రెడ్డి పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు లడ్డూ పవిత్రతపై దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఇకనైనా ఆయన ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్