పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం గూడూరులో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసిన ఘనత టీడీపీదేనన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ, బీజేపీలకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సదస్సులో వరప్రసాద్, సునీల్ కుమార్, రామకృష్ణ, నెలవల సుబ్రహ్మణ్యం, పరసారత్నం, విజయశ్రీ, పనబాక కృష్ణయ్య, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.