ఉచిత ఇసుక విధానానికి విఘాతం

81చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి మైనింగ్ మాఫియా విఘాతం కలిగిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు అన్నారు. గురువారం మదనపల్లి పట్టణంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది వాగులు, కుంటల్లో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఇసుక ఎత్తనీయకుండా అడ్డుపడటమే కాకుండా లొంగకపోతే కేసులు పెట్టిస్తున్నారని వాపోయారని చెప్పారు. ఈ మాఫియాను అరికట్టే వరకు సీపీఎం పోరాడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్