మదనపల్లెలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

64చూసినవారు
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మదనపల్లె పట్టణంలో మంగళవారం ఆ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఐటీ, టెలికాం రంగాలకు పునాదులు వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రపంచంతో భారతదేశం పోటీపడేలా అడుగులు వేశారన్నారు.

సంబంధిత పోస్ట్