హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

54చూసినవారు
మదనపల్లె పట్టణంలో శ్రీనివాసులురెడ్డిని కత్తులతో నరికి హత్యాయత్నానికి పాల్పడిన వారిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ యువరాజు కథనం మేరకు, స్థానిక టీఎన్ఆర్ కాలనీలో ఉండే ఎన్. రమణరెడ్డి, అతని కొడుకు మనోజ్ కుమార్ రెడ్డి, కొంతకాలంగా ఇంటిస్థలం కోసం సీటీఎం రోడ్డులో వుండే ఎన్. శ్రీనివాసులు రెడ్డితో గొడవ పడుతున్నారు. ఈ విషయమై మే1న కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడగా, ఆ ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్