రోజా ఓడిపోతుందని సీఎం సభతో తెలిసిపోయింది: భాను ప్రకాశ్

1023చూసినవారు
చిత్తూరు జిల్లా నగరిలో రోజా ఓటమి నేడు జరిగిన సభతో తేటతెల్లమైందని టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ అన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఎందుకు వచ్చి వెళ్లారో కార్యకర్తలకు తెలియడం లేదన్నారు. 1, 000మందితో సభ జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు. 2019లో జగన్ గాలేరు-నగరి, పవర్ లూమ్, ఉపాధి అవకాశాల హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్