కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహంతో టీడీపీ విజయం సాధించడం ఆనందంగా ఉందని జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తెలిపారు. సోమవారం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోవిందరాజులు, కిషోర్, మంజు తదితరులు పాల్గొన్నారు.