ఇంటిని ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్

6457చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మదనపల్లి మార్గంలోని ఈడిగపల్లి వద్ద గ్యాస్ ట్యాంకర్ శుక్రవారం సాయంత్రం ఓ ఇంటిని ఢీకొంది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న తరుణంలో వాహనాలు అతివేగంగా వెళుతూ ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడంతో అదుపుతప్పి ఇంటి గోడలోకి వాహనం దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్