భూ వివాదంలో దంపతులపై దాడి

59చూసినవారు
భూ వివాదంలో దంపతులపై దాడి చేసిన ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండలో ఉంటున్న హుండీ సతీశ్ కుమార్, అతని భార్య మాలతి భూమిని జయచంద్ర కబ్జా చేశాడు. ఈ విషయమై నిలదీసిన దంపతులపై ఆయన మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులను కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్