రోడ్డు ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు

5840చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక తీవ్రంగా గాయపడిన ఘటన సోమల మండలంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు పుంగనూరు నుంచి సోమల వైపు బుధవారం ప్యాసింజర్ ఆటోలో పర్వీన్ , సోఫియా(13) వస్తుండగా మండల కేంద్రానికి సమీపంలోని రాజీవ్ కాలనీ వద్ద రోడ్డులో ఉన్న గుంతలో ఆటో దిగడంతో ఆటోలో నుంచి ఒక్కసారిగా సోఫియా రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన సోఫియా ను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్