దక్షిణ లెబనాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. 40 టెర్రర్ టార్గెట్స్ని ధ్వంసం చేసినట్టు బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఆర్టిలరీ, ఫైటర్ జెట్లతో దాడులు నిర్వహించినట్టు ఐడీఎఫ్ ధృవీకరించింది. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) దక్షిణ లెబనాన్లోని ఐతా అల్-షాబ్ చుట్టూ ఉన్న స్టోరేజ్ కేంద్రాలతో సహా సుమారు 40 హిజ్బుల్లా టెర్రర్ లక్ష్యాలను ఛేదించినట్టు సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.