మంత్రి సమక్షంలో భారీగా పార్టీలోకి చేరికలు

67చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో భారీగా టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి మంత్రి పెద్దిరెడ్డి కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ పట్టణము మరియు మండలంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు వైసీపీలోకి చేరుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్