చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ పదవికి నాగరాజ రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. ఎన్నికలలో వైసిపి పరాజయం పొందడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆలయ చైర్మన్ పదవికి తను రాజీనామా చేస్తున్నట్లు నాగరాజు రెడ్డి తెలిపారు. తన రాజీనామాను ఆలయ ఈఓ కు అందజేసినట్లు తెలియజేశారు.