ఆస్తి కోసం తల్లిపై దాడి చేసిన కొడుకు

66చూసినవారు
ఆస్తి కోసం తల్లిపై దాడి చేసిన కొడుకు
ఆస్తి కోసం కన్నతల్లిపై సొంత కొడుకే దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని ఓ గ్రామానికి చెందిన గాజుల మల్లమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. మల్లమ్మ తన ఆస్తిలో కొంత ఇద్దరు కొడుకులకు పంచింది. తన ఆడబిడ్డలకు కొంత జాగా ఇవ్వాలని అనుకోవడంతో చిన్న కొడుకు నాగరాజు ఆడపిల్లకు ఆస్తి ఇవ్వకూడదని తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీనిపై మల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్