పట్టణంలో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు

78చూసినవారు
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పుంగనూరు పట్టణంలో టీడీపీ శ్రేణులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి బానసంచా కాలుస్తూ చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్