పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాము: ఎంపీ

63చూసినవారు
పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని ఎంపీ మిథున్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలపై వారి నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పుంగునూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్