చవితి వేడుకల్లో వివాదం.. గ్రామాల్లో పికెట్

67చూసినవారు
కేవీబీపురం మండలం పెరిందేశం, రాగిగుంట గ్రామాల మధ్య వినాయక చవితి సందర్భంగా ఘర్షణలు జరిగాయి. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవి మనోహర, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు గ్రామాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్