గాంధీ మహాత్మునికి మంచి రోజులు

80చూసినవారు
తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలోని టవర్ క్లాక్ కూడలి వద్ద గాంధీజి విగ్రహాన్ని ఉంచి దశాబ్దాలు కాలమైంది. ఎందరో సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు పదవులలో కొనసాగారు. ఏ నాడు గాంధీ విగ్రహాన్ని కడగాలన్న ధ్యాస ఎవరికి రాలేదు. మంగళవారం సాయంత్రం వైసీపీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి రేపు జరుగనున్న గాంధీ జయంతి సందర్బంగా మహాత్ముని విహ్రయాన్ని శుభ్రంగా కడిగించి రంగుల వేయించారు.

సంబంధిత పోస్ట్