మంగళంపాడు చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు

2605చూసినవారు
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మంగళంపాడు చెరువులో పలువురు అక్రమార్కులు జోరుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడి చెరువులో యంత్రాలతో తవ్విన మట్టిని టిప్పర్లు ద్వారా సూళ్లూరుపేట, తడ మండలాల్లో స్థిరాస్తి వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెరువులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం పనులు చేపడుతున్నారు. అయినా పక్కనే తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్