నియోజకవర్గంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి కవితమ్మ కోరారు. ఆదివారం శ్రీనివాస కాలనీ, ఇట్నేని వారిపల్లె, తంబళ్లపల్లెలోని క్రిష్ణానగర్, మసీదు వీధి, నాగేంద్ర వీధిలలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సర్పంచి నీలుఫర్ మైనుద్దీన్, చౌడేశ్వర, కేఆర్ మల్రెడ్డి, రామూర్తిపాల్గొన్నారు.