తిరుపతి నగరంలోని పాస్ పోర్ట్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి కంప్యూటర్లు మొరాయించాయి. కంప్యూటర్లు పనిచేయని కారణంగా రెండు గంటలుగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.