తిరుమలలో పట్టుబడ్డ నకిలీ ఐఏఎస్ అధికారి

11627చూసినవారు
తిరుమలలో పట్టుబడ్డ నకిలీ ఐఏఎస్ అధికారి
ఐఏఎస్ అధికారిగా చెలామణి అవుతున్న నకిలీని తిరుమలలో టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహారావు అనే వ్యక్తి జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖని సమర్పించాడు. ఈవో కార్యాలయ సిబ్బంది అతడి ప్రవర్తనపై అనుమానంతో విజిలెన్స్ అధికారులకి సమాచారం అందించడం జరిగింది. వారు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అతడు గుంటూరు మరియు విజయవాడలో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్