తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జవహర్ రెడ్డి

1523చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదివారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట టీటీడీ ఈఓ ధర్మారెడ్డి రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్