తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ విరామ సమయంలో శ్రీలంక మినిస్టర్ తిరు మహింద అమరవీర, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.